ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనం.

కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కీలక సమావేశం.

రోజుకు 80 వేల మందికే దర్శనం.. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం అమలు చేయాలని కేరళ సర్కారు నిర్ణయం.

త్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శించుకునే వీలుంటుంది. నిన్న కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక మీదట శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అయ్యప్ప భక్తులు పరమ పవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.

స్వామి వారి దర్శనానికి ఆన్ లైన్ బుకింగ్ ను తీసుకు వస్తున్న కేరళ ప్రభుత్వం. రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది.

వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో, అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

Spread the love