శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్..!
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.
దీని కోసం అయ్యప్ప భక్తులు sabarimalaonline.org వెబ్సైట్ కి వెళ్లి రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి.
మొబైల్ నంబర్ కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు..