
పహల్గాంలో టెర్రరిస్టుల దాడి, జమ్ము కాశ్మీర్ లో తదంతర పరిస్థితులపై చర్చించేందుకు తక్షణం పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులంతా ఏకతాటిపై ఉన్నామనే సంకేతం బలంగా పంపించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతం పంపించవచ్చని అన్నారు.