
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన.
తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన వాయుగుండం.
*తుపానుకు ‘దానా’గా నామకరణం*
రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం.
గడిచిన 6 గంటల్లో గంటకు 18కిమీ వేగంతో కదులుతున్న తుపాను.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం.
*పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనున్న తుపాను*
ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 560 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 630 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 630 కిమీ. దూరంలో దానా తుపాను.
పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు.
ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.