
రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కేటీఆర్.
కూతురు గాయత్రి ఆకస్మిక మరణంతో శోకసంద్రంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
కూకట్ పల్లిలో రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ గాయత్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.